నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి గుంటూరు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ లో 10 వేల లీటర్ల పెట్రోల్.. నాలుగు వేల లీటర్లు డీజిల్ ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ప్రమాద ఘటనపైఆరా తీస్తున్నారు.
